Telugu Gateway
Andhra Pradesh

అమరావతి ‘దారెటు’!

అమరావతి ‘దారెటు’!
X

చంద్రబాబు హయాంలో నిత్యం అమరావతి జపం చేయగా..ఇప్పుడు జగన్ సర్కారు తన రూటు సపరేటు అని స్పష్టం చేసింది. శుక్రవారం నాడు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతి కోసం 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దీంతో అమరావతి పరుగులు పెట్టడం సందేహమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ లో కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించటంతో ఇక అమరావతిలో పనుల వేగం మందగించటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరి కేంద్రం నుంచి రాజధాని నిర్మాణం కోసం ఏమైనా సాయం సాధిస్తారా? లేక వెసులుబాటు ను బట్టి మెల్లగా అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మిస్తారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతం మంత్రుల కమిటీ పలు అంశాలపై, చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది. ఈ నివేదిక సిద్ధం అయిన తర్వాత ఏమైనా వ్యూహం మార్చుకుంటారా? అన్నది వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా మంత్రుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కానీ పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం కన్పించటంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it