అమిత్ షాతో డీఎస్ భేటీ
BY Telugu Gateway11 July 2019 9:27 PM IST
X
Telugu Gateway11 July 2019 9:27 PM IST
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ గురువారం నాడు పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్ మరుసటి రోజే అమిత్ షాతో సమావేశం కావటం వెనక కారణం ఏమిటా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో బిజెపి తెలంగాణలో దూకుడు పెంచింది. ఈ తరుణంలో అమిత్ షాతో డీఎస్ భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీకి సంబంధించి నిర్దిష్ట సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story