Telugu Gateway
Telangana

తెలంగాణ గ్రూప్2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

తెలంగాణ గ్రూప్2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
X

గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు కేసులతో పెండింగ్ పడిపోయిన తెలంగాణ గ్రూప్ 2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు చిగురించినట్లు అయింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు పలు సూచనలు కూడా చేసింది. గతంలో తీసేసిన 343 మంది విద్యార్ధుల అంశాన్ని మాత్రం పున:సమీక్షించాలని హైకోర్టు టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌-2 నియామక ఎంపిక ప్రక్రియకు మార్గం సుగమం అయినట్లు అయింది.

ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్‌నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో గతంలో తొలగించిన 343 మందికి ఊరట లభించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 3147 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ ముగిసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో 1:2 రేషియో పద్దతిలో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. 1032 పోస్టులకు 1:3 రేషియోలో 3147 మంది అభ్యర్థులు సెలెక్టయిన విషయం తెలిసిందే.

Next Story
Share it