Telugu Gateway
Telangana

మోజో టీవీని లాక్కున్నారు..రవిప్రకాష్ సంచలన ఆరోపణ

మోజో టీవీని లాక్కున్నారు..రవిప్రకాష్ సంచలన ఆరోపణ
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మీడియా కబ్జా సాగుతోందని ఆరోపించారు. "మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోంది. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి. దొంగ పత్రాలతో భూములు లాక్కున్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారు. పోలీసుల సహకారంతో ‘మోజో’ టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారు. మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌ లంతా పోరాడాలి" అని రవిప్రకాష్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్‌ అన్ని టీవీలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అయితే మీడియాను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నదెవరో స్పష్టంగా చెప్పలేదు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అజ్ఞాతాన్ని వీడి.. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Next Story
Share it