రానా..సాయిపల్లవి సినిమా షురూ
BY Telugu Gateway15 Jun 2019 12:26 PM GMT
X
Telugu Gateway15 Jun 2019 12:26 PM GMT
వెరైటీ కాంబినేషన్. రానా, సాయిపల్లవిలతో సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమా పేరే ‘విరాటపర్వం’. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశాలు శనివారం నాడు ప్రారంభం అయ్యాయి. దీనికి సీనియర్ హీరో వెంకటేష్ క్లాప్ కొట్టారు. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘నీదినాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల తన రెండో సినిమాను ప్రారంభించాడు.
ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి దర్శకుడు వేణు ఉడుగులకు స్క్రిప్ట్ ను అందించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
Next Story