‘రంగ్ దే’ అంటున్న నితిన్
BY Telugu Gateway24 Jun 2019 8:03 AM GMT
X
Telugu Gateway24 Jun 2019 8:03 AM GMT
నితిన్ యమా దూకుడు మీద ఉన్నారు. వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన 29వ సినిమానే ‘రంగ్ దే’. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు ప్రకటించింది. ఇందులో మరో విశేషం ఉంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే ఈ కొత్త సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు నితిన్.
ఈ సినిమాకు రంగ్దే అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్గా పీసీ శ్రీరామ్ పనిచేయనున్నారు. ఇప్పటికే నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్ను ప్రారంభించగా.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Next Story