Telugu Gateway
Politics

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్,ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిల మ‌ధ్య స‌ఖ్య‌త మ‌రింత ముందుకు సాగనుంది. సీఎం కెసీఆర్ తెలంగాణ‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టుప్రారంభోత్స‌వానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఆహ్వ‌నించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. దీనికోసం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ వెళ్లి స్వయంగా వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించనున్నారు.

ఇటీవలే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని పలు పంపుహౌస్‌లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలు, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గ‌తంలో ఇద్ద‌రు నేత‌లు సాగునీటి ప్రాజెక్టుల‌పై విమ‌ర్శలు చేసుకున్నారు. ఏపీ ప్రాజెక్టుల‌ను తెలంగాణ సీఎం అడ్డుకుంటున్నా చంద్ర‌బాబు చోద్యం చేశార‌ని గ‌తంలో జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారు.

Next Story
Share it