Telugu Gateway
Andhra Pradesh

ఐఏఎస్ అన్నా..ఇంజనీర్ అన్నా చెప్పన్నా..ఏంటి చెప్పేది!

ఐఏఎస్ అన్నా..ఇంజనీర్ అన్నా చెప్పన్నా..ఏంటి చెప్పేది!
X

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంలో అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన జగన్ ఇఫ్పుడు ఇంజనీర్ అన్నా..ఐఏఎస్ అన్నా...సెకట్రరీ అన్నా..చెప్పన్నా చెప్పన్నా అంటున్నాడు. ఏందయ్యా చెప్పేది. ఏమన్నా ఉంటే కదా చెప్పేది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో కట్టిన ప్రజా వేదికను పడగొట్టి పైశాచిక అనందం పొందుతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేశామని తెలిపారు. అమరావతిలో చంద్రబాబు నివాసంలో జరిగే పార్టీ సమీక్షకు వెళుతూ ఉమా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జగన్ లా విలాసవంతం అయిన భవనం కట్టుకోకుండా అమరావతికి రోడ్లు వేయాలి... ప్రపంచ స్థాయి రాజధాని చేయాలని చూశాడు. ఒక్క ఇటుక పెట్టలేదన్నావు.

ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నావు. మీ తండ్రి హయాంలో పోలవరం మట్టిపనులు చేశారు. మేం ఎంత పనిచేశాం. చెప్పు. ఏ2 విజయసాయిరెడ్డితో నీతులు చెప్పించుకోవాల్సి పరిస్థితి వచ్చింది మా ఖర్మ. కాలం కలసి వచ్చింది వాళ్ళకు. కేబినెట్ హోదా వెలగబెడుతున్నావు. నువ్వు పెట్టే దొంగ కేసుల్లో నేను దొంగను కాలేదు విజయసాయిరెడ్డీ. గవర్నమెంట్ ఆఫీస్ పడేసి వీరంగాలు వేసి. ఉత్తర కుమార్ ప్రగల్భాలు కాదు. చేతనైతే మంచి పనులు చేయండి అంటూ ఉమా మీడియా ముందు ఆవేశంతో ఊగిపోయారు.

Next Story
Share it