Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు జగన్ సర్కారు మరో షాక్

చంద్రబాబుకు జగన్ సర్కారు మరో షాక్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడికి జగన్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ చంద్రబాబుకు భద్రతగా ఉన్న ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ వో)లతోపాటు ఈ టీమ్ లో ఉండే ముగ్గురు రిజర్వ్ ఇన్ స్పెక్టర్, మరో పదిహేను మంది సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. ఇది టీడీపీలో కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం ఎస్కార్ట్, పైలట్ వాహనాలను తప్పించారనే టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు భద్రతా సిబ్బందిని గణనీయంగా కుదించారు.

ప్రస్తుతం 2ప్లస్ 2 లెక్కన ఇద్దరు కానిస్టేబుళ్ళను కేటాయించారు. ఇప్పటికే మాజీ మంత్రి నారా లోకేష్ తోపాటు చంద్రబాబు కుటుంబ సభ్యులందరి భద్రతను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే సర్కారు ఈ చర్యలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భద్రతా సలహా కమిటీ సమావేశం నిర్వహించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it