Telugu Gateway
Andhra Pradesh

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జగన్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో జగన్
X

తెలంగాణ సీఎం కెసీఆర్ పిలిచారు. ఏపీ సీఎం జగన్ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ తన తోటి మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లతో కలసి శుక్రవారం ఉదయం 9.45 గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. జగన్ కు తెలంగాణ మంత్రులు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడిగడ్డకు చేరుకొని జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకుంటారు.

అక్కడ జరిగే హోమంలో కేసీఆర్‌తోపాటు పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

Next Story
Share it