ఏపీలో నామినేటెడ్ పండగకు సర్వం రెడీ
BY Telugu Gateway11 Jun 2019 1:04 PM GMT
X
Telugu Gateway11 Jun 2019 1:04 PM GMT
ఒకేసారి ఏపీ మంత్రివర్గంలో 25 మందిని మంత్రులను నియమించి సంచలనం రేకెత్తించిన జగన్మోహన్ రెడ్డి త్వరలోనే నామినే టెడ్ పోస్టుల భర్తీకి కూడా రెడీ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలుముగిసిన తర్వాత ఈ ప్రక్రియ ఉంటుందని..ఎమ్మెల్యేలకు కూడా అత్యంత కీలకమైన కార్పొరేషన్లు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే వై వీ సుబ్బారెడ్డికి అత్యంత కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ నేతలు అందరూ హ్యాపీగానే ఉన్నారని తెలిపారు.
Next Story