‘ఎవరు’ ఫస్ట్ లుక్
BY Telugu Gateway3 Jun 2019 10:38 AM GMT
X
Telugu Gateway3 Jun 2019 10:38 AM GMT
అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రమే ‘ఎవరు’?. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ‘ఎవరు’గా రాబోతోన్న ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్లో తెరకెక్కిస్తుండగా.. వెంటక్ రామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానున్నట్లు ప్రకటించాడు. గూఢచారి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు అడవి శేష్. హీరోగానే కాకుండా కథకుడిగానూ మెప్పించిన ఈ హీరో గూఢచారికి సీక్వెల్ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఎవరు సినిమాలో నవీన్ చంద్ర,మురళీ శర్మలు కీలక పాత్రలు పోషించారు.
Next Story