Telugu Gateway
Politics

కెటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

కెటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
X

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గెలుపు గెలుపే కాదంటూ కెటీఆర్ తాజాగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతుకకు మల్కాజ్ గిరి ప్రజలు పట్టం కట్టారని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సిద్ధిపేట, సిరిసిల్లలో టీఆర్ఎస్ మెజారిటీలు తగ్గటం ఆ పార్టీ పతనానికి సంకేతాలు అని పేర్కొన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఓటమి పాలయ్యారని..టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనటానికి ఇంత కంటే సంకేతాలు అవసరమా? అని ప్రశ్నించారు.

ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఫలితాలను ఐదేళ్ళ క్రితం అసెంబ్లీ ఫలితాలతో పోల్చుకోవటం మీ అతి తెలివికి నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు..ఈ ఏప్రిల్ లో జరిగిన లోక్ సభ ఎన్నికలకూ టీఆర్ఎస్ 20 లక్షల మేర ఓట్లు నష్టపోయిందని పేర్కొన్నారు. మల్కాజ్ గిరిలో తన గెలుపుపై కెటీఆర్ వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Next Story
Share it