Telugu Gateway
Politics

ఇదెక్కడి న్యాయం

ఇదెక్కడి న్యాయం
X

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలోని ఐదు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ వ్యవహారంపై పెద్ద దుమారమే సాగుతోంది. ఓ వైపు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకంగా ఈ అంశంపై సీఈసీతో సమావేశం అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడే నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. పోలింగ్ పూర్తయిన ఇన్ని రోజులకు రీపోలింగ్ ఏమిటి అంటూ టీడీపీ మండిపడుతోంది. అదే సమయంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పడేసి..ఒక్క వైసీపీ ఫిర్యాదులపై మాత్రమే స్పందించటం ఎక్కడ న్యాయం అని టీడీపీ నేతలు వాపోతున్నారు.

కొంత మంది మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని కలసి తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని..వైసీపీ ఫిర్యాదును వెంటనే ఎందుకు ఈసీకి పంపారని ప్రశ్నించారు. తాము చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా రీపోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి టీడీపీ సీఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఎల్వీ వైసీపీ సీఎస్ గా మారిపోయారని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.

Next Story
Share it