Telugu Gateway
Telangana

చివరి నిమిషం విమాన టిక్కెట్..40 శాతం డిస్కౌంట్

చివరి నిమిషం విమాన టిక్కెట్..40 శాతం డిస్కౌంట్
X

సహజంగా అప్పటికప్పుడు విమాన టిక్కెట్ అంటే రేటు మోత మోగుతుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటేనే కాస్త తక్కువ రేట్లకు టిక్కెట్లు దొరుకుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. విమానం బయలుదేరటానికి మూడు గంటల ముందు అయితే 40 శాతం డిస్కౌంట్ రేట్లకే టికెట్ ఇవ్వటానికి రెడీ అయింది. సహజంగా అంత ఆకస్మాత్తుగా ప్రయాణం అంటే అత్యవసరం అయిన వారు మాత్రమే చేస్తారు. ఎయిర్ ఇండియా కొత్త ఆఫర్ తో ఇక నుంచి ట్రెండ్ మారే అవకాశం కూడా కన్పిస్తోంది.

ఎప్పుడు 40 శాతం టిక్కెట్ డిస్కౌంట్ కు దొరికితే అప్పుడు ప్రయాణించేలా కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు తాజా నిర్ణయం కొంతలో కొంత ఉపశమనం కల్పించేదిగానే కన్పిస్తోంది. ఖాళీ సీట్లతో అలా వెళ్ళే బదులు 40 శాతం డిస్కౌంట్ తో అయినా టిక్కెట్లు అమ్మకలిగితే అది సంస్థకు ప్రయోజనకరమే అన్న కోణంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఎయిర్ ఇండియా వంటి సంస్థ 40 శాతం డిస్కౌంట్ అంటే విమాన ప్రయాణికులు ఆసక్తిచూపటం ఖాయం. ఏది ఏమైనా చివరి నిమిషంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి ఇది బాగా కలసి వస్తుంది.

Next Story
Share it