Telugu Gateway
Politics

రామోజీరావుతో భేటీకి ఫిల్మ్ సిటీకి చంద్రబాబు

రామోజీరావుతో భేటీకి ఫిల్మ్ సిటీకి  చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ కానున్నారు. దీని కోసం ఆయన అమరావతి నుంచి హెలికాఫ్టర్ లో నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీలో దిగనున్నారు. అక్కడే రెండు గంటల పాటు గడిపి మధ్యాహ్నాం 1.30 గంటలకు బయలుదేరి అమరావతికి వెళ్లనున్నారు. కేవలం రామోజీరావుతో భేటీ కోసం చంద్రబాబు రామోజీ ఫిల్మ్ సిటీ రానుండటం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు..లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో చంద్రబాబు, రామోజీరావుల భేటీ ఆసక్తికరంగా మారింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ అధికారం నిలబెట్టుకుందా? లేదా అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఏపీలో ఈ సారి వైసీపీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందనే వార్తలు బలంగా విన్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రానున్నాయి. మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని..టీడీపీనే గ్యారంటీగా అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఈ తరహా మీటింగ్ ఫిల్మ్ సిటీ వేదికగా మారనుందని రాజకీయాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేంద్రంలో మోడీని ఎలాగైనా అడ్డుకోవాలనే టార్గెట్ తో చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి సన్నాహాలు చేస్తున్న విషయం తెలసిందే. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు పలితాలు ఇస్తాయో వేచిచూడాల్సిందే. మరో వైపు కెసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story
Share it