ఏబీసీడీ ట్రైలర్ వచ్చేసింది
BY Telugu Gateway14 May 2019 12:25 PM IST
X
Telugu Gateway14 May 2019 12:25 PM IST
అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన సినిమానే ‘ఏబీసీడీ’. ఈ సినిమా మే 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమెరికా నుంచి వచ్చి భారత్ లో కష్టాలు పడే యువకుడిగా ఈ సినిమాలో అల్లు శిరీష్ కన్పించనున్నారు. శిరీష్ తోపాటు మాస్టర్ భరత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
మళయాళంలో విజయవంతం అయిన ఏబీసీడి సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. గత కొంత కాలంగా అల్లు శిరీష్ ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకూ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. మరి ఈ రీమేక్ అయినా ఓ గుర్తింపునిస్తుందా? లేదా తెలియాలంటే 17వరకూ వేచిచూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=Td5JEXvTVPk
Next Story