Telugu Gateway
Telangana

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
X

విద్యార్దుల టెన్షన్ తొలగింది. ఫలితాలు వచ్చేశాయి. ఇక భవిష్యత్ ప్లానింగే మిగిలింది. పాస్ అయిన వారు అంతా కుష్. ఫెయిల్ అయిన వారు మాత్రం..సప్లిమెంటరికీ రెడీ. లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలను తెలంగాణ సర్కారు గురువారం సాయంత్ర విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో (2,70,575 ) 59.8 శాతం మంది, సెకండియర్‌లో 65శాతం (2,71,949) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా,34శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో జగిత్యాల చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మే 14 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

Next Story
Share it