Telugu Gateway
Politics

పోలవరం చంద్రబాబుకు ఓ ఏటీఎం

పోలవరం చంద్రబాబుకు ఓ ఏటీఎం
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంచనాలు పెంచుకోవటం..అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం చంద్రబాబు పనిగా మారిందని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం చంద్రబాబుకు ఓ ఏటీఎంగా మారిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇఫ్పటికే ఏడు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని తెలిపారు. అంచనాల పెంపు ద్వారా చంద్రబాబు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో అందరికీ తెలుసని మోడీ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కన్పించటం లేదన్నారు. చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలు అన్నింటికి ఆయన బొమ్మలు తగిలించుకుని..వాటిని తన గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

డేటా చోరీ అంశాన్ని కూడా మోడీ తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఆయన సేవ చేయటం లేదు..వాళ్లు మిత్రులు కాదు అన్నారు. ప్రజల వివరాలు దొంగిలించారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీలకు ప్రజల ప్రగతి పట్టదని..వాళ్ళు కేవలం తమ కుటుంబాల సంక్షేమం కోసమే పనిచేస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ సోమవారం రాజమండ్రి ఆర్ట్స్‌ కళశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. యూటర్న్‌ బాబు హెరిటేజ్‌ సంస్థ కోసమే పనిచేస్తున్నారని, యూటర్న్‌ బాబు పరిస్థితి బాహుబలి సినిమాలో భల్లాలదేవలా ఉందని ఎద్దేవా చేశారు. యూటర్న్‌ బాబు చేస్తుంది నమ్మకద్రోహం, అవినీతి అని విమర్శించారు.

Next Story
Share it