కెసీఆర్ కు కోడ్ వర్తించదా?
BY Telugu Gateway20 April 2019 6:27 PM IST
X
Telugu Gateway20 April 2019 6:27 PM IST
ఎన్నికల కమిషన్ ఏపీ సర్కారుపై వివక్ష చూపిస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు జరిగాయి కదా?. అక్కడ కూడా కోడ్ ఉందిగా. కానీ తెలంగాణ సీఎం కెసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారికంగా మీడియాకు సమాచారం కూడా అందజేస్తున్నారు?. కానీ అక్కడ లేని అభ్యంతరం ఒక్క ఏపీలోనే ఎందుకు? అని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా? అని లోకేశ్ ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. ఏంటీ పక్షపాతం?" అని లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు.
Next Story