Telugu Gateway
Politics

మోడీ, బాబు ట్విట్టర్ ఫైటింగ్

మోడీ, బాబు ట్విట్టర్ ఫైటింగ్
X

ప్రధాని నరేంద్రమోడీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఓడిపోతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎపిలో ఓడిపోతుందని నమ్ముతున్నానని ఆయన అన్నారు.ఎపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎపీ ప్రజలు టిడిపి ప్రభుత్వ అవినీతితో విసిగిపోయారని ఆయన అన్నారు. ఏపీలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మోడీ దీనికి సంబంధించి ముందస్తుగా ఈ ట్వీట్ చేశారు. అయితే దీనిపై టీడీపీ మండిపడింది. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా వెంటనే మోడీ ట్వీట్ కు కౌంటర్ గా ట్వీట్ చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ?’ అంటూ మండిపడ్డారు.

Next Story
Share it