Telugu Gateway
Politics

కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో లో ఏపీకి ప్రత్యేక హోదా

కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో లో ఏపీకి ప్రత్యేక హోదా
X

కీలక అంశాలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతే కాదు..తాము అధికారంలోకి వస్తే రాఫెల్ డీల్ పై విచారణ జరిపాస్తామని పేర్కొంది. బ్యాంకులకు వేల కోట్లరూపాయల రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన వారిపై సమగ్ర విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెడతామని ప్రకటించారు. దేశంలో 2030 నాటికి పేదరికం లేని దేశంగా భారత్ ను మారుస్తామని పేర్కొన్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సీనియర్‌ నేతలు చిదంబరం తదితరుల సమక్షంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏడాదికి పైగా మ్యానిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేశామని రాహుల్‌ పేర్కొన్నారు.

ఉపాధి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయ రంగ పునరుద్ధరణపై మేనిఫెస్టో ప్రత్యేకంగా దృష్టిసారించిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 కోట్ల నగదు సాయం తమ ఎన్నికల ప్రణాళికలో అత్యంత కీలకమని రాహుల్‌ తెలిపారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ పీ చిదంబరం మాట్లాడుతూ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు దేశంలో కోట్లాది మంది గొంతుకను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఎన్నికల ప్రణాళిక కసరత్తును చేపట్టేముందు వివిధ వర్గాలతో విస్తృత సంప్రదింపులు చేపట్టామని చెప్పారు. రైతులు, యువత, మహిళలు, పరిశ్రమలు, మైనారిటీలు, విద్య, వైద్యం, జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలకాంశాలను తమ ప్రణాళికలో పొందుపరిచామని తెలిపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలు

పేదలకు కనీస ఆదాయ హామీ పధకం

నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72వేల ఆర్ధిక సాయం

ప్రత్యేకంగా కిసాన్‌ బడ్జెట్‌

ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ

ఉపాధి హామీ పధకం 100 రోజుల నుంచి 150 రోజులకు విస్తరణ

విద్యారంగానికి బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు

ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ

యువతకు మూడేళ్లపాటు అనుమతులు లేకుండా వ్యాపారం చేసుకునే వెసులుబాటు

Next Story
Share it