Telugu Gateway
Telangana

యాజమాన్యానికే అడ్డం తిరిగిన జర్నలిస్టు

యాజమాన్యానికే అడ్డం తిరిగిన జర్నలిస్టు
X

ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే పేరు మోసిన జర్నలిస్ట్. అంచెలంచెలుగా ఎదిగారు. ఓ ప్రధాన ఛానల్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ జర్నలిస్ట్ ఇప్పుడు ఏకంగా సంస్థ యాజమాన్యానికే అడ్డం తిరిగారు. ఈ వ్యవహారం ఇప్పుడు మీడీయా వర్గాలతో పాటు కార్పొరేట్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. టెలివిజన్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఛానల్ ఇటీవల కాలంలో చేతులు మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే అసలు సమస్య ప్రారంభం అయింది. ఛానల్ యాజమాన్యం అయితే చేతులు మారింది కానీ..యాజమాన్యం చేతిలో ఇంత వరకూ ఏమీ లేదు. అంతే కాదు కొత్త యాజమాన్యానికి ఆ జర్నలిస్టు రకరకాల చుక్కలు చూపిస్తుండటంతో వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది.

ఈ వారంలో ఛానల్ కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అటు ఛానల్ యాజమాన్యం...ఇటు సదరు జర్నలిస్టు వర్గం వారు పరస్పరం కేసులు పెట్టుకునేందుకు కూడా రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి తాము ఛానల్ కొనుగోలు చేస్తే సదరు జర్నలిస్ట్ చేతిలో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని..ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కొంత మంది ప్రభుత్వ పెద్దల జోక్యాన్ని కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఛానల్ లో మార్పులు, చేర్పులకు ప్రస్తుతం అంతా రంగం సిద్ధం అయినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it