చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
BY Telugu Gateway11 April 2019 12:24 PM IST
X
Telugu Gateway11 April 2019 12:24 PM IST
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళుతున్నాయని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయటం లేదని..ఎన్నికల అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు పలు ప్రాంతాల్లో మొరాయించటంపై ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ఆలశ్యం అయిన చోట రీపొలింగ్ కు ఆదేశించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కూడా ఈవీఎంల వ్యవహారంపై పలు చోట్ల నిరసనలకు దిగారు.
Next Story