Telugu Gateway
Politics

మోడీపై బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు

మోడీపై బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు
X

ప్రధాని నరేంద్రమోడీపై నందమూరి బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీకి సిగ్గులేదని మండిపడ్డారు. మోడీకి సిగ్గుంటే తన విమర్శలకు ఏదైనా నదిలో దూకేవారన్నారు. ప్రదాని మోడీ, కెసీఆర్, జగన్ లు తనను ఏమీ చేయలేరన్నారు. గతంలోనూ బాలకృష్ణ ఇలాగే నరేంద్రమోడీని ఓ బహిరంగ సభలో దూషించారు.

కరవుతో అల్లాడే అనంతపురం జిల్లాలో ఇప్పుడు పచ్చటి పొలాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ కృషే అన్నారు. విశాఖపట్నంలో కూడా తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. అక్కడ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. తన ప్రచారంలో భాగంగా బాలకృష్ణ డప్పు కొడుతూ..డ్యాన్స్ లు వేస్తూ ఓటర్లను ఉత్సాహపరిచారు. హిందుపురం నుంచి తనను, ఎంపీగా నిమ్మల కిష్టప్పను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Next Story
Share it