కార్తీకి జోడీగా రష్మిక
BY Telugu Gateway14 March 2019 11:37 AM IST
X
Telugu Gateway14 March 2019 11:37 AM IST
టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లు అందుకుంటున్న భామ రష్మిక మందాన. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. హీరో కార్తీతో తొలి సినిమా చేయనుంది. కన్నడ, తెలుగు ప్రేక్షకులను తనను ఎంతగానో ఆదరించారని..ఇప్పుడు కోలీవుడ్ కు రమ్మని అడిగితే వెంటనే వచ్చేశా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కార్తీ అండ్ టీమ్ తో కలసి పనిచేయనుండటం సంతోషంగా ఉందన్నారు.
ఈ సినిమా షూటింగ్ బుధవారం నాడే ప్రారంభం అయింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు నితిన్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. మరి తొలి సినిమాతోనే తమిళంలో రష్మిక హిట్ అందుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే.
Next Story