Telugu Gateway
Politics

టీడీపీలో చేరిన కోట్ల ఫ్యామిలీ

టీడీపీలో  చేరిన కోట్ల ఫ్యామిలీ
X

కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇదో కొత్త మలుపు. రాజకీయంగా రెండు వైరి వర్గాలుగా ఉన్న కోట్ల, కెఈ ఫ్యామిలీలు ఒకే వేదికపై చేరాల్సిన పరిస్థితి వచ్చింది. కోట్ల ఫ్యామిలీ శనివారం నాడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో టీడీపీలో చేరింది. ఇటీవల వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డి టీడీపీలో చేరారు. కర్నూలు జిల్లా కొడుమూరులో జరిగిన బహిరంగ సభలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎన్నో సీఎం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. టీడీపీలో చేరాలంటే తాను కొన్ని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరానని.. వాటిపై సీఎం వేగంగా స్పందించి పరిష్కరించటంతోనే పార్టీ మారినట్లు తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. రైతులకు అండగా నిలుస్తున్న టీడీపీనే ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.

Next Story
Share it