Telugu Gateway
Politics

దత్తన్నకు నో ఛాన్స్...కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ సీటు

దత్తన్నకు నో ఛాన్స్...కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ సీటు
X

సికింద్రాబాద్ లోక్ సభ రాజకీయం హాట్ హాట్ గా మారబోతోంది. బిజెపి సీనియర్ నేత దత్రత్రేయను కాదని ఆ పార్టీ అధిష్టానం ఈ సారి సీటును కిషన్ రెడ్డికి కేటాయించింది. దీంతో పోరు రసవత్తరంగా జరిగే అవకాశం కన్పిస్తోంది. ఇటీవలే బిజెపిలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్‌ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 10 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించింది. నిజామాబాద్‌ స్థానం నుంచి డి.అరవింద్‌ పోటీ చేయనున్నారు. కరీంనగర్‌ స్థానం నుంచి పోటీకి బండి సంజయ్‌ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుంది.

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్ధులు వీరే

కరీంనగర్‌: బండి సంజయ్‌

నిజామాబాద్‌: డి. అరవింద్‌

మల్కాజిగిరి: ఎన్‌ రామచంద్రరావు

సికింద్రాబాద్‌: కిషన్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌: డీకే అరుణ

నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ): బంగారు శ్రుతి

నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్‌

భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్‌ రావు

వరంగల్‌: చింతా సాంబమూర్తి

మహబూబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌

Next Story
Share it