అయోధ్య కేసులో కీలక మలుపు
ఎన్నికల ముందు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అయోద్య వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలోమధ్యవర్తిత్వం నెరపడానికి ముగ్గురితో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లో జస్టిస్ ఖలీఫుల్లా, రవిశంకర్ ప్రసాద్, శ్రీ రామ్ పంచ్ల పేర్లను సూచించింది. విచారణ ప్రక్రియ నాలుగు వారాల్లో మొదలుపెట్టి..ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని ప్యానల్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కమిటీ విచారణను రికార్డు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఈ వివరాలు ఏవీ కూడా మీడియాకు బహిర్గతం చేయరాదని సుప్రీంకోర్టు సూచించింది. ఫైజాబాద్ కేంద్రంగా మధ్యవర్తితత్వం చేయాలని సూచించింది.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదస్పద భూమిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగా.. రామ్లల్లా, నిర్మోహ అఖోడా, సున్నీ వక్ఫ్ బోర్డు మధ్య ఈ వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్కు అప్పజెప్పడంతో ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్ తేల్చనుంది. అయోధ్యలో 67. 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా 1993లో స్టే విధించారు. 2010లో 2.77 ఎకరాల భూమిని అలహాబాద్ కోర్ట్ ముగ్గురికి పంచింది. ఈ తీర్పుపైనే ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. మరి మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో వేచిచూడాల్సిందే.