Telugu Gateway
Politics

ఏపీ బిజెపి ఎంపీ అభ్యర్ధులుగా కన్నా..పురంధేశ్వరి

ఏపీ బిజెపి ఎంపీ అభ్యర్ధులుగా కన్నా..పురంధేశ్వరి
X

బిజెపి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎంపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపాట లోక్ సభకు, విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బరిలోకి దిగనున్నారు. విజయనగరం టిక్కెట్ ను సన్యాసి రాజుకు. నరసాపురం నుంచి మాణిక్యాలరావుకు, అనంతపురం చిరంజీవిరెడ్డి, హిందూపురం పార్ధసారధి, గుంటూరు నుంచి జయప్రకాష్, కర్నూలు పీవీ పార్ధసారధి, నంద్యాల ఆదినారాయణ, నెల్లూరు నుంచి సురేష్ రెడ్డి, తిరుపతి నుంచి శ్రీహరిరావు, ఏలూరు చిన్నం రామకోటయ్య, రాజమండ్రి నుంచి సత్యగోపీనాథ్, కాకినాడ నుంచి దొరబాబు, కడప నుంచి కెవివి సత్యనారాయణరెడ్డిలకు టిక్కెట్లు కేటాయించారు.

Next Story
Share it