Telugu Gateway
Cinema

వెరైటీగా ‘చిత్రలహరి’ టీజర్

వెరైటీగా ‘చిత్రలహరి’ టీజర్
X

‘బాధపడకు బాబాయ్. నీకు కూడా ఓ మంచి రోజు వస్తుంది. ఆ వచ్చేది ఏదో ఆదివారం రమ్మను బాబాయ్. ఇంటి దగ్గర ఖాళీగా పడి ఉంటాను.’ ఓ ఫ్రెండ్ తో హీరో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. ఇది ఎందులో అనుకుంటున్నారా?. ‘చిత్రలహరి’ సినమాలో. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ బుధవారం నాడు విడుదలైంది. చాలా డిఫరెంట్ గా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్, నివేథ పేతురాజ్ లు నటిస్తున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ‘టీజర్’లో కొత్తదనం కన్పిస్తోంది.

‘చిత్రలహరి. అప్పట్లో దూరదర్శన్ లో ఎవరీ ఫ్రైడే వచ్చే ప్రోగ్రాం. ఈ చిత్రలహరి 2019లో ఓ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా’ అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ‘మగాళ్ళు అంతా సేమ్. మనల్ని రీచ్ అయ్యేంత వరకూ ఒకలా ఉంటారు. రీచ్ అయ్యాక అందరూ ఒకేలా ఉంటారు’ అన్న డైలాగ్ తో ఆకట్టుకున్నారు నివేథ. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా..నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?time_continue=21&v=yyYEX_Bk_L4

Next Story
Share it