డిప్యూటీ స్పీకర్ సీటులో పద్మారావుగౌడ్
BY Telugu Gateway25 Feb 2019 6:16 AM GMT

X
Telugu Gateway25 Feb 2019 6:16 AM GMT
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం సభలో ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కెసీఆర్, ప్రతిపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క, విపక్షాల నేతలు వెంటరాగా పద్మారావుగౌడ్ స్పీకర్ స్థానంలో ఆసీనులయ్యారు. ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఆ తర్వాత ఉప సభాపతి బాధ్యతలు చేపట్టిన పద్మారావుకు సభలోని సభ్యులందరూ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పద్మారావు పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విపక్ష పార్టీ సభ్యులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story