Telugu Gateway
Politics

టీడీపీకి మరో ఎంపీ షాక్

టీడీపీకి మరో ఎంపీ షాక్
X

తెలుగుదేశం పార్టీకి మరో ఎంపీ షాకిచ్చారు. అమలాపురం ఎంపీ పండల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పక్షం రోజుల వ్యవధిలోనే టీడీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెప్పటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితమే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు రవీంద్రబాబు వంతు వచ్చింది. అయన కూడా వైసీపీలోనే చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సారి రవీంద్రబాబు ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం.

కొద్ది రోజుల క్రితం తాను పార్టీ మారటం లేదని స్పష్టం చేసిన రవీంద్రబాబు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పటం కీలక పరిణామంగా మారింది.రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. రవీంద్రబాబు త్వరలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో బేటీ అయి తన భవిష్యత్ సీటుపై చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it