Telugu Gateway
Telangana

ఖమ్మంలో టీఆర్ఎస్ కు షాక్...జడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామా

ఖమ్మంలో టీఆర్ఎస్ కు షాక్...జడ్పీ ఛైర్ పర్సన్ రాజీనామా
X

తెలంగాణలో ముందస్తు ఎన్నికలతోపాటు..పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి షాక్. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే టీఆర్ఎస్ అత్యంత బలహీనంగా ఉంది. ఈ తరుణంలో ఆ పార్టీకి చెందిన జడ్పీ ఛైర్ పర్సన్ కవిత తన పదవికి రాజీనామా చేశారు. జిల్లాలోని సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా గత ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎలాగైనా ఖమ్మం పార్లమెంట్ సాటును దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించుకుంటున్న తరుణంలో జరిగిన ఈ పరిణామం అధికార పార్టీకి ఊహించని షాక్ గానే రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత పదవికి రాజీనామా చేశారు.

గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్నన్‌కు అందజేశారు. పార్టీలో ఆమెకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వక పోవడంతో రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మధిర స్థానంలో పోటీ చేయాలని ఆమె భావించారు. కానీ మధిర టికెట్‌ను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ వర్గానికి చెందిన లింగాల కమల్‌ రాజ్‌కు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీ చైర్‌పర్సర్‌గా ఎన్నికయ్యారు.

Next Story
Share it