Telugu Gateway
Politics

చంద్రబాబు సమర్పించు..సర్కారు ‘ప్రాయోజిత దీక్ష’

చంద్రబాబు సమర్పించు..సర్కారు ‘ప్రాయోజిత దీక్ష’
X

పార్టీలు దీక్షలు చేస్తాయి..ధర్నాలు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏపీలోనే విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏకంగా ‘సర్కారే’ దీక్షకు చేస్తుంది. కేంద్రం వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి దీక్ష చేయటాన్ని కూడా తప్పుపట్టలేం. కానీ టైమింగ్ కీలకం. దీంతోపాటు ముఖ్యమంత్రి దీక్షకు కోట్లాది రూపాయలు వెచ్చించి బస్సుల్లో ప్రజలను ఢిల్లీకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో.

అంతే కాదు..దీక్షకు తరలివచ్చే పార్టీ నాయకులు..ఇతర సంఘాల వారికి హోటల్ సౌకర్యంతోపాటు..అన్ని వసతులూ సర్కారు చేస్తుందట. ఇలాంటి దుబారా వ్యయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడూ అదే పనిచేస్తున్నారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ప్రభుత్వాలు రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితులు లేవు. ఓ వైపు ఆర్థిక కష్టాల్లో ఉన్నామని చెబుతూ ఇంతలా ప్రజల డబ్బు దుర్వినియోగం చేయాలా?

Next Story
Share it