Telugu Gateway
Politics

వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి

వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి
X

వైసీపీలో కొత్త చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. గురువారం నాడు హైద‌రాబాద్ లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను స్వాగ‌తించారు. వైసీపీలో చేరిన అనంత‌రం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ...‘ వైఎస్‌ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశంపై వైఎస్‌ జగన్‌ ఓ అజెండా సెట్‌ చేస్తున్నారు. చంద్రబాబు దానికి రియాక్ట్‌ అవుతున్నారు. అజెండాను సెట్‌ చేసే వారే నాయకుడు అవుతారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉండటానికి కారణం వైఎస్‌ జగన్‌.

వైఎస్సార్ సీపీ పోరాటాల వల్లే ఇప్పటికీ హోదా సజీవంగా ఉంది. చంద్రబాబుకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు పప్పుఉ బెల్లంలా ఏదో ఇస్తున్నారు. డబ్బుతో ఓటర్లను చంద్రబాబు కొనాలనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు దెబ్బతీశారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, ప్రత్యేక హోదాను తీసుకురాలేదు. హోదాను మోదీ కాళ్ల కింద తాకట్టు పెట్టారు. సంతలో పశువుల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. నీచమైన రాజకీయాలకు చరమగీతం పాడాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it