Telugu Gateway
Politics

టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి ఆమంచి

టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి ఆమంచి
X

అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఇఫ్పటికే కడప జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇదే బాటలో పయనించటానికి రెడీ అయిపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడనున్నారు. ఆయన ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చేరటానికి నిర్ణయించుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న ఆయన వైసీపీ కండువా కప్పుకోవటానికి సిద్ధమయ్యారు.

గతంలో ఆయన జనసేనలోకి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన వైసీపీలో చేరటానికే నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన శ్రేయోభిలాషులతో చర్చల అనంతరం మంగళవారం సాయంత్రం కానీ..బుధవారం నాడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచి విజయం సాధించిన ఆయన తర్వాత అధికార టీడీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

Next Story
Share it