Telugu Gateway
Politics

బడ్జెట్ హైలెట్స్

బడ్జెట్ హైలెట్స్
X

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంట్ కు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేరుకు ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా సరే పూర్తిగా ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు స్పష్టం అవుతోంది. దేశ రక్షణ రంగానికి బడ్జెట్ లో మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ..అవసరం అయితే మరింత పెంచటానికి కూడా రెడీ అని ప్రకటించారు. పియూష్ గోయల్ బడ్జెట్ స్పీచ్ లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....

​​​రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి.

​​జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు

​​​​సుస్థిర, సమ్మిళిత వృద్ధి కొనసాగింపు లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించాం

​​2020కు నవ భారతం నిర్మిస్తాం

​​దేశం ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి

​​రైతుల ఆదాయం రెండింతలు పెరిగింది.

​​​3 లక్షల కోట్ల డిఫాల్ట్ లోన్లు రికవర్ చేసాం

​​వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భారత్‌ 6వ స్థానానికి చేరింది

​​మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం.

​​రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం.

​​​పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.

​​ గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.

​​గ్రామీణ, పట్టణాల మధ్య అంతరాల తొలగింపుకు కృషి చేస్తున్నాం.

​​ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

​​ గ్రామీణ సడక్‌యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగింది.

​​మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి 60 వేల కోట్లు ఖర్చు చేశాం.

​​మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం.

​​22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం.

​​ప్రధానమంత్రి సడక్‌యోజనకు.19వేల కోట్లు ఖర్చు చేశాం.

​​ఇప్పటివరకూ 3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది.

​​2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం

​​పేద రైతులకు ఆదాయం పెంపును చర్యలు చేపట్టాం.

​​​చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి

​​2 హెక్టార్ల వరకు భూమి కలిగిన చిన్న రైతులకు ప్రతియేటా రూ. 6,000

​​డిసెంబర్ 2018 నుంచే ఈ పథకం అమలవుతుంది

​​దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ది

​​ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది

​​ప్రధాన్‌మంత్రి కిసాన్‌ యోజన కింద రైతులకు ఏడాది 6వేలు అందిస్తాం.

​​ 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు.

​​మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.

​​​ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఎకరానికి రూ. 6 వేలు ధనసాయం.

​​ప్రతి ఏడాదీ పెట్టుబడి సాయం అందిస్తాం.

​మూడు ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది.

​​చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు

​​గ్యాట్యుటీ పరిమితిని 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచుతున్నాం.

​​కొత్త పెన్షన్‌ విధానం సరళీకరిస్తాం!

​​పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.

​​​కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు.

​​​ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది.

​​కార్మిక ప్రమాద బీమా మొత్తం.1.50 లక్షల నుంచి .6లక్షలకు పెంపు

​​ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌.

​​60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా 3వేలు పింఛన్‌ వచ్చే విధంగా పథకం.

​​నెలకు 100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత .3వేల పింఛన్‌.

​​అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు

​​​గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం.

​​గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు

Next Story
Share it