నేనా రాజకీయాల్లోకా...నో!
BY Telugu Gateway22 Jan 2019 7:04 AM GMT
X
Telugu Gateway22 Jan 2019 7:04 AM GMT
బాలీవుడ్ భామ కరీనా కపూర్ క్లారిటీ ఇఛ్చేశారు. తాజాగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని..కాంగ్రెస్ టిక్కెట్ పై ఎంపీగా పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఆమె బ్రేక్ వేశారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన లేదని..తన ఫోకస్ అంతా సినిమాలే అంటూ తేల్చిచెప్పేశారు. అయితే రాజకీయాల్లోకి రావాలని తనను ఇంతవరకు ఏ పార్టీ సంప్రదించలేదని తెలిపారు.
ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కరీనా హీరోయిన్గా నటించిన ‘గుడ్న్యూస్’ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కరీనాను బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story