‘తస్సాదియ్యా’ అంటున్న చరణ్..కైరా
రామ్ చరణ్. కైరా అద్వానీ. కొత్త కాంబినేషన్. ఈ బాలీవుడ్ భామ ఇప్పటికే మహేష్ బాబుతో కలసి ‘భరత్ అనే నేను’లో నటించి సూపర్ హిట్ కొట్టేసింది. ఇప్పుడు రామ్ చరణ్ తో కలసి హాట్ హాట్ ఫోజులతో ఓ పాట చేసింది. అదే తస్సాదియ్యా పాట. ఈ పాటను చిత్ర యూనిట్ డిసెంబర్ 17న విడుదల చేయనుంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. అటు రామ్ చరణ్, ఇటు కైరా కూడా మాంచి హిట్స్ తో జోష్ లో ఉన్నారు. మరి ఈ వినయ విధేయ రామ సినిమా వీళ్లిద్దరి ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచిచూడాలి.
మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇఫ్పటికే రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం. చిత్రనిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు జరిగే షెడ్యూల్తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ షెడ్యూల్లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. 2 పాటల్లో ఒకటి స్పెషల్ సాంగ్. ఆ పాటలో రామ్చరణ్ సరసన బాలీవుడ్ నటి ఈషా గుప్తా డ్యాన్స్ చేస్తారని తెలిపారు.