Telugu Gateway
Politics

టీజెఎస్ కు రచనారెడ్డి గుడ్ బై

టీజెఎస్ కు రచనారెడ్డి గుడ్ బై
X

ఎన్నికల ముందు అన్ని పార్టీల్లో అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. గత కొంత కాలంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడుతున్న లాయర్ రచనా రెడ్డి తెలంగాణ జన సమితి (టీజెఎస్)కు గుడ్ బై చెప్పారు. ఆమె ఆ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆదివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీజేఎస్‌ ఛైర్మన్‌ కోదండరాంపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఎన్నికలకు ముందే మహాకూటమి ఫిక్స్‌ అయ్యిందని, కోదండరాం కూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు.

మైనార్టీలకు టీజేఎస్‌ ఒక్క టికెట్‌కు ఇవ్వలేదని.. ఇక మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లని ఆమె ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలిసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి గెలవడానికా లేక ఓడిపోవడానికా అని ఆమె ప్రశ్నించారు. కూటమో రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని తిరస్కరిస్తారని అన్నారు.

Next Story
Share it