Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ పోటీచేసేది అక్కడ నుంచే!

పవన్ కళ్యాణ్ పోటీచేసేది అక్కడ నుంచే!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా నుంచే బరిలో దిగనున్నారా?. అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అదే సంకేతాలు పంపారు శ్రేణులకు. ఆయన వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీచేయనున్నారు. జనసేనాని వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి పవన్ బరిలోకి దిగితే ఆ ప్రభావం రెండు జిల్లాలపై ఖచ్చితంగా ఉంటుందని..ఇది తమకు లాభిస్తుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే ప్రాంతాలపై పలు సంకేతాలు ఇచ్చినా..అంతిమంగా పిఠాపురంలో మాత్రం పవన్ బరిలో నిలుస్తారని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో బరిలో నిలిచినా..ఫోకస్ మాత్రం పరిమితంగా ఉండే అవకాశం కన్పిస్తోంది.

రాష్ట్రమంతటా తిరిగే బదులు...గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్న చోట ఎక్కువ దృష్టి కేంద్రీకరించటం ఉత్తమం అన్నది ఆ పార్టీ నేతల అంచనా. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఎంపిక చేసిన ప్రాంతాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీని ద్వారా తమ సత్తా చాటాలని యోచిస్తున్నారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పిఠాపురం సభలో కూడా పవన్ చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ కు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Next Story
Share it