ఎన్టీఆర్ 15 లక్షలు..కళ్యాణ్ రామ్ ఐదు లక్షలు
BY Telugu Gateway15 Oct 2018 7:51 AM GMT
X
Telugu Gateway15 Oct 2018 7:51 AM GMT
శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ కదిలింది. హీరోలు వరస పెట్టి తమ సాయాన్ని ప్రకటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 15 లక్షల రూపాయలు. ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అందరి కంటే ముందు సంపూర్ణేష్ బాబు 50 వేల రూపాయల సాయం ప్రకటించి అందరికీ మార్గదర్శిగా నిలిచారు. వీరితోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి లక్ష రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. తన వంతు సాయం చేస్తానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు విరాళాలు ఇచ్చి సహకరించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Next Story