Telugu Gateway
Andhra Pradesh

నవయుగాపై ఐటి దాడులు..టీడీపీకి షాక్!

నవయుగాపై ఐటి దాడులు..టీడీపీకి షాక్!
X

ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వానికి అత్మీయ కంపెనీగా మారిన నవయుగాపై ఐటి దాడులు జరిగాయి. ఇప్పటికే ఐటి దాడులు అంటే వణుకుతున్న టీడీపీకి ఇది మరో షాక్ అనే చెప్పొచ్చు. నవయుగా సంస్థ ఏపీలో వేలాది కోట్ల రూపాయల పనులు చేస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ పెద్దలకు ఎంతో సన్నిహితంగా ఉంది. హైదరాబాద్ లోని నవయుగాతో పాటు కంపెనీకి చెందిన పలు సంస్థల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు లో కీలక పనులు కూడా ఈ సంస్థకు అప్పగించారు. నవయుగ కి చెందిన 47 కంపనీ లు పై ఆరా తీస్తున్న ఐటీ అధికారులు . గత నాలుగేళ్లుగా ఐటీ రిటర్న్స్ , ప్రాజెక్టుల నిర్వహణ పై విచారణ చేస్తున్న ఐటీ . రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నిబంధనలు ఉల్లగించారని ఆరోపణలు కంపెనీ ఎదుర్కొంటోంది.

నవయుగా ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్ తో పాటు, నవయుగ బెంగళూరు టోల్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగా క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే కంపెనీలు పై ఆరా . కృష్ణా డ్రైడ్జింగ్ కంపెనీ లిమిటెడ్ , కృష్ణ కంపెనీ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ , శుభం కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ లావాదేవీలు పై ఆరా తీస్తున్న ఐటీ అధికారులు. కొత్తగా వేలాది కోట్ల రూపాయల పనులు కూడా ఈ సంస్థకు సర్కారు అప్పగించటానికి రెడీ అయింది. ఈ కంపెనీపై కొద్ది రోజుల క్రితమే ఆర్ వోసీ అధికారులు దాడులు చేసి బోర్డులు లేకుండా పదుల సంఖ్యలో ఒకే అడ్రస్ లో ఉన్నట్లు గుర్తించారు.

Next Story
Share it