Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోమళ్లీ ఐటి దాడులు

ఏపీలోమళ్లీ ఐటి దాడులు
X

ఏపీలో ఐటి దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ఈ సారి వంతు వైజాగ్ ది. వైజాగ్ లో ని ప్రత్యేక ఆర్థిక మండలిలోని పలు సంస్థలతో పాటు మైనింగ్ కంపెనీలు టార్గెట్ గా ఈ సారి ఐటి బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం ఉదయం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. ఏపీతో పాటు తమిళనాడులోనూ భారీ ఎత్తున ఈ దాడులు సాగుతున్నాయి.

గత కొంత కాలంగా ఏపీ సర్కారు ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా..ఈ సంస్థ మాత్రం తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడులపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో పలు సంస్థలతోపాటు టీడీపీ ఎంపీ సీ ఎం రమేష్ కు చెందిన కంపెనీల్లోనూ ఐటి సోదాలు జరిగిన విషయం తెలిసిందే.

Next Story
Share it