Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..నారా లోకేష్ లకు షాక్

చంద్రబాబు..నారా లోకేష్ లకు షాక్
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లకు షాక్. ఐటి రంగం అభివృద్ధి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఐటి కంపెనీలకు భూములు కేటాయించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ లపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అర్హత లేని సంస్థలకు కూడా అడ్డగోలుగా భూములు కేటాయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని పిటీషనర్లు ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే ఐటి కంపెనీలను ఎపీఎన్ఆర్ టీ ద్వారా సిఫారసు చేయించి..వాటికి ఏ మాత్రం అర్హతలు లేకపోయినా కోట్లాది రూపాయల మేర రాయితీలు ఇచ్చారనేది పిటీషర్ల అభియోగం.

ఈ పిల్ లో మాజీ ఐటి శాఖ మంత్రి పల్లె రఘనాధరెడ్డి పేరు కూడా ఉంది. న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఏపీఎన్ ఆర్ టి సిఫారసులతో పలు ఐటి కంపెనీలు ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విశాఖపట్నంలో ఫ్లాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూముల కేటాయింపు కూడా పెద్ద స్కామ్ గా ఉన్న విషయం తెలిసిందే. తొలుత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తో పాటు ఇన్నోవా సొల్యూషన్స్ అనే సంస్థకు కూడా భూములు కేటాయించి..చిక్కుల్లో పడతామనే భయంతో ఆ సంస్థకు చేసిన కేటాయింపులను సర్కారు ఉపసంహరించుకుంది. ఇవన్నీ కూడా ఐటి శాఖలో అక్రమాలకు ఆధారంగా నిలబోతున్నాయి.

Next Story
Share it