Telugu Gateway
Cinema

ప్రభాస్..పూజా హెగ్డేలతో కొత్త సినిమా

ప్రభాస్..పూజా హెగ్డేలతో కొత్త సినిమా
X

ప్రభాస్ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇప్పటికే సాహో సినిమాలో చేస్తున్న ఈ హీరో..మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఒప్పుకున్న చిత్రం సాహో. ఇది త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది. దీంతో కొత్త సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డె నటించనుంది. కేకే రాధకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయని ప్రభాస్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అంతే కాదు.. ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో తెరకెక్కించనున్నారని వెల్లడించారు. గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన జిల్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాధకృష్ణే ఈ సినిమా డైకర్టక్. త్వరలోనే కొత్త సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారభించనున్నారు. ఎక్కువ భాగం యూరప్‌లో చిత్రీకరించినున్నట్లు సమాచారం.

Next Story
Share it