విడుదలకు సిద్ధమైన ‘నన్ను దోచుకుందువటే’
BY Telugu Gateway15 Sep 2018 4:38 AM GMT
X
Telugu Gateway15 Sep 2018 4:38 AM GMT
సుధీర్ బాబు తాజా సినిమా సమ్మోహనం మంచి హిట్ సాధించింది. ఈ సినిమాలో ఆయన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అదే జోష్ లో ఈ హీరో ఇప్పుడు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ట్రైలర్..పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో మరో విశేషం కూడా. ఈ సినిమాను సుధీర్ బాబు తన సొంత నిర్మాణ సంస్థతో తెరకెక్కించారు. ఈ సినిమాలో సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్నారు.
Next Story