Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘బ్రాండ్’ పరువు తీసిన నారాయణ!

చంద్రబాబు ‘బ్రాండ్’ పరువు తీసిన నారాయణ!
X

ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరువు తీసేశారు. అమరావతి బాండ్ల విషయంలో అసలు ‘సంగతి’ బయట పెట్టారు. ఇంత కాలం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి పెట్టుబడులు పెట్టారని గొప్పలు చెప్పుకున్న సర్కారు..తన డొల్లతనాన్ని అంగీకరించింది. అమరావతిలో అసలు ఏమీ లేదని..భవనాలు..ఆదాయం వచ్చే మార్గం లేనందున ఈ బాండ్లకు సరైన రేటింగ్ రాలేదని..అందుకే అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. బాండ్లపై వడ్డీ రేటును నిర్ణయించేది మనకున్న రేటింగ్ అని నారాయణ తెలిపారు.

ఆర్థిక పరిస్థితి, తిరిగి చెల్లింపు సామర్ధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రేటింగ్ ఇస్తారని వెల్లడించారు. అమరావతి రాజధానికి తిరిగి చెల్లించేందుకు ఆదాయ మార్గం లేదని మంత్రి వెల్లడించారు. అందుకే ఏ ప్లస్ రేటింగ్ మాత్రమే వచ్చిందని..రేటింగ్ బాగుంటే వడ్డీ రేట్లు తగ్గుతాయని తెలిపారు. దీంతోనే అమరావతి బాండ్లపై 10.32 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఇంత కాలం అసలు దేశంలోనే ఎవరూ చేయని రీతిలో గంటలో రెండు వేల కోట్ల రూపాయలు సాధించి రికార్డు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఇప్పుడు అసలు అమరావతి రేటింగే బాగాలేదని చెప్పారు. అమరావతి రేటింగ్ బాగాలేకపోతే..చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరిగినట్లో మరి?.

Next Story
Share it