అదిరిపోయేలా 2.ఓ టీజర్
ఆలశ్యం అయినా రజనీకాంత్ హీరోగా నటించిన 2.ఓ సినిమాకు సంబంధించిన టీజర్ అదిరిపోయేలా వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించారు. టీజర్ చూస్తే ఎవరైనా షాక్ కు గురవ్వాల్సిందే. ఓ పెద్దాయన కారులో అలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఓ రద్దీ ప్రాంతంలో అమ్మాయిలు సెల్ఫీలు దిగుతుంటారు. అబ్బాయిలు ఫోన్లు మాట్లాడుతుంటారు. కానీ అందరి చేతుల్లోని ఫోన్లు అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోతుంటాయి. చూడటానికి ఇది వింతగా ఉన్నా...అదిరిపోయేలా ఉంది. అలా ఎగిగిపోయిన ఫోన్లు అన్నీ ఇంట్లో నిద్రపోతున్న ఓ వ్యక్తి గదికి గోడలా మారతాయి. అందులో నుంచి విలన్ అక్షయ్ డిజిటల్ ఫోటో లుక్ కన్పిస్తుంది. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు ఎన్నో ఈ టీజర్ లో ఉన్నాయి.
రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమాకు కొనసాగింపుగానే 2.ఓ సినిమాను తెరకెక్కించారు. భారత్ లో సుమారు 545 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన తొలి విఎఫ్ఎక్స్ వండర్ అంటూ చిత్ర బృందం ప్రచారం చేసింది. చిత్ర యూనిట్ చెబుతున్న విధంగానే గురువారం రీలీజ్ అయిన టీజర్ చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ టీజర్లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్ అవతారం ఎత్తి చిట్టిని మళ్లీ రంగంలోకి దించారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ టీజర్లోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. నవంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ విడుదలైనన ఐదు గంటల్లోనే ఈ సినిమా టీజర్ 25 లక్షల వ్యూస్ సాధించటం విశేషం.
https://www.youtube.com/watch?v=2wvq8hdGdAw